పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్మాతగా మారబోతున్నారు. అయితే అప్పుడు తన అభిమాని కోసం నిర్మాత గా మారితే ఇప్పుడు మాత్రం తన ఫ్యామిలీ మెంబర్ కోసం నిర్మాతగా మారనున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నా కానీ, ఈ విషయం మాత్రం ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక అగ్ర హీరో నిర్మాతగా మారడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అందులోనూ తన కోసం కాకుండా తన కుటుంబ సభ్యుల కోసం నిర్మాతగా మారుతున్నాడు అంటే కచ్చితంగా అది విశేషమే. గతంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించారు.

అయితే చాలా సినిమాలకు నిర్మాతగా ఆయన పేరు పడలేదు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్మరార్ నిర్మాతగా ఆ సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అయితే ఓ రెండు సినిమాలకు మాత్రం నిర్మాతగా పవన్ కళ్యాణ్ పేరు పడింది. ఆ సినిమాలే 'సర్దార్ గబ్బర్ సింగ్', 'చల్ మోహన్ రంగ'. ఇక తొలి సినిమాకు ఆయనే హీరో అన్న విషయం తెలిసిందే. ఇక రెండవ సినిమాకు మాత్రం తన అభిమాని నితిన్ హీరోగా నటించాడు. అయితే నిర్మాతగా మాత్రం పవన్ కళ్యాణ్ కి సరైన ఫలితం దక్కలేదని చెప్పాలి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కానీ, నితిన్ నటించిన చల్ మోహన్ రంగా సినిమా గాని పవన్ కి సరైన విజయాన్ని అందించలేదు.

అయితే మళ్లీ చాలా కాలం తర్వాత ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు పవన్. అయితే ఈసారి మాత్రం తన కుటుంబ సభ్యుల కోసమే ఈ స్టెప్ తీసుకున్నాడని అంటున్నారు. అయితే అది ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ వీరిద్దరిలో ఒకరితోనే ఈ సినిమా ఉండవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ లోని రామ్ చరణ్ సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఇది ఒకటేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: