ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17 న విడుద‌లై క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం విధిత‌మే. అయితే  ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం  తొలుత కాస్త నెగిటివ్ టాక్ వినిపించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్‌తో భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఈ వారం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది పుష్ప‌. ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డుల‌ను కైవ‌సం చేసుకుంటుందో.. ఈ  పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన పుష్ప‌.

 ముఖ్యంగా ఊరమాస్‌ పాత్రలో నటించిన బన్నీ న‌ట‌న పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఎప్పుడు  ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌తో ఎదురు చూసారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర‌మాస్ పాత్ర‌లో న‌టించ‌డమే కాకుండా.. తొలిసారి పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన  అల్లు అర్జున్  తొలి మూవీ కావ‌డం విశేషం.  అయితే పుష్ప‌పై పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.  తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ ‘పుష్ప’ సినిమాను వీక్షించిన  అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హ‌గ్ చేసుకున్న ఫోటోను  నితిన్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి..  పుష్ప‌లో అల్లుఅర్జున్ డార్లింగ్ ఫెర్ ఫార్మెన్స్ అదిరిపోయిన‌ద‌ని పేర్కొన్నారు. అంతే కాదు పుష్ప అంటే ఫైర్ కాద‌ని.. బ‌న్నీ అంటేనే ఫైర్ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేసాన‌ని.. సుకుమార్, ర‌ష్మిక‌, డీఎస్పీకి, ఇంకా ఇత‌ర చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేసాడు నితిన్‌. ఇక మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన పుష్ప కేవ‌లం మూడు రోజుల్లోనే రూ.85 కోట్లు  షేర్ .. 173 కోట్ల గ్రాస్ సాధించిన‌ది. తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, భాష‌ల్లో కూడా ఈ సినిమా విడుద‌లై దూసుకుపోతూ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: