కొత్త బంగారులోకం సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యి మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా అంత పెద్ద సూపర్ హిట్ కావడంతో పెద్ద హీరోల నమ్మకాన్ని కూడా ఏర్పర్చుకున్నాడు ఈ హీరో. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన పెద్ద హీరోలతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చేశాడు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు చేసే విధంగా ఏ హీరో కూడా ముందుకు రాని రోజులవి.

అలాంటి టైం లో  ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమా కోసం ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. అలా మహేష్ బాబు మరియు వెంకటేశ్ లను ఆ సినిమా కోసం ఒప్పించి పెద్ద ప్రయత్నం చేసి దానిలో సక్సెస్ అయ్యాడు. ఆ చిత్రం కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వారి కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా మిగిలిపోయింది ఇది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల కు ఎదురు లేదు ఆయన ఇక పెద్ద సినిమాలు చేసుకుంటూ పోవడమే అని అందరూ అనుకున్నారు.

కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అన్నట్లు ఆయన తీసిన బ్రహ్మోత్సవం సినిమా ఆయన కెరియర్ పై భారీ ఎఫెక్ట్ ను చూపించింది. మహేష్ బాబు హీరోగా ఆ చిత్రాన్ని చేసిన శ్రీకాంత్ అడ్డాలసినిమా ఫ్లాప్ ప్రభావం తన మీద పడేలా చేసుకున్నాడో ఏమో ఆ తర్వాత ఆయనకు సినిమా రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.  అలా ఇటీవలే నారప్ప సినిమా చేయగా అది ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. అయితే అది రీమేక్ సినిమా కావడంతో శ్రీకాంత్ కు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మళ్లీ వెంకటేష్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: