కరోనా వల్ల సినీ పరిశ్రమ బాగా దెబ్బ తిన్నది..ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు వరుస సినిమాల తో బిజీగా వుంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరో ల వరకూ అందరూ చేతి నిండా సినిమాలతో ఫామ్ లో వున్నారు. ఇకపోతే విషయానికొస్తె.. ఈ వారం చాలా సినిమాలు ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం సందడి చేయనున్న పాపులర్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...


శ్యామ్‌ సింగరాయ్‌..

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి కలిసి నటించిన చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌.. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించారు..ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో క్రిష్మస్ కానుకగా విడుదల కానుంది.రెండు చిత్రాలూ వరుసగా ఓటీటీల్లో విడుదల అయ్యి తర్వాత ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. 


బ్యాక్‌డోర్‌.. 

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. అన్నీ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకొని 25 న విడుదల కానుంది.మంచి మెసేజ్ ఇస్తున్న చిత్రంగా అందరినీ కట్టిపడేస్తుందని చిత్ర నిర్మాత అన్నారు. 


వరుడు కావలెను..

రీతూ వర్మ, నాగ సౌర్య జంటగా నటించిన సినిమా ఇదే..లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఒకే అనిపించింది.ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది.

ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ విడుదల కానున్నాయి.. కమెడీయన్ సప్తగిరి నటించిన సినిమా గూడు పుఠాణి.. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని అందిస్తుంది. ఈ సినిమా కూడా ఇక్కడ విడుదల కు సిద్ధంగా వుంది.విక్రమ్.. ఈ సినిమా కుడా ఇక్కడ సందడి చేస్తుంది. తెలుగు లోనే కాదు,ఆశ ఎన్‌కౌంటర్‌ మిగిలిన ఇండస్ట్రీ లలో ని సినిమా కూడా విడుదల కానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: