సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, గీత గోవిందం  ఫెమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, చాలా నెలల క్రితం సర్కారు వారి పాట  సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ న థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఆ తర్వాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ను జనవరి 7 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  దీనితో రెండు సినిమాల మధ్య పోటీ ఎందుకు అని భావించిన  మహేష్ బాబు తన సర్కారు వారి పాట సినిమా ను దాదాపు మూడు నెలలు వాయిదా వేసుకున్నాడు,  ఏప్రిల్ 1 వ తేదీ న సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.

  అయితే ఈ సినిమాతో పాటే భీమ్లా నాయక్ సినిమా కూడా జనవరి 12 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది,  అయితే తాజా గా ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 25 వ తేదీ కి వాయిదా వేశారు, అయితే ఈ విషయాన్ని దిల్ రాజు తెలియజేశాడు. అలాగే ఎఫ్ త్రీ సినిమా ను కూడా వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు తెలియజేశాడు, కానీ మహేష్ బాబు సినిమా మాత్రం చెప్పిన తేదీ అయిన ఏప్రిల్ ఒకటో తేదీ నే విడుదల అవుతుంది అని కూడా దిల్ రాజు తెలియ జేశాడు, ఇలా దిల్ రాజు మహేష్ బాబు సినిమా విడుదల తేదీ ని ఏ మాత్రం వాయిదా వేయడం లేదు అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆనందం కలుగ జేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: