ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ దగ్గర పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కల్లోలంతో బోసిపోయిన సినీ బాక్స్ ఆఫీస్..నందమూరి అఖండ సినిమాతో పూర్వ వైభవం తెచ్చుకుంది అనడంలో సందేహమే లేదు. ఇక బాలయ్య స్టార్ట్ చేసిన సందడిని మిగతా హీరోలు కంటీన్యూ చేస్తున్నారు. రానున్న మూడు నాలుగు నెలలు వరుస బడా హీరోల సినిమాలు రానున్న నేపధ్యంలో .. ధియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. రీఎసెంట్ గా రిలీజైన పుష్ప సృష్టించిన సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఫస్ట్ డే టాక్ పరంగా అటు ఇటు ఉన్నా..కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గెదేలే అన్నట్లు అల్లు అర్జున్ కోట్లు కొల్లగొట్టాడు. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా 10 రోజులకు 100కోట్లు కలెక్ట్ చేస్తే..కానీ పుష్ప మాత్రం కేవలం రెండు రోజుల్లోనే ఆ స్దాయి కలెక్షన్స్  ను రాబట్టిన్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ప సినిమా చూసి వచ్చిన ప్రతి వ్యక్తి చెప్పే డైలాగ్ ఒక్కటే..ఈ సినిమా లో అల్లు అర్జున్ పర్ ఫామెన్స్ కేక..కొత్త అల్లు అర్జున్ ని చూసాం.. అల్లు అర్జున్ చించేసాడు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రాణం పెట్టి నటించాడు భయ్యా..అవార్డులన్నీ బన్నీ కే అంటూ బన్నీ ని పొగడ్తలతో ముంచెతుతున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా అదే మాటలను పుష్ప సక్సెస్ మీట్ లో చెప్పింది. ఆంధ్ర  ప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా  సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ  హీరోయిన్‌ రష్మిక మందన్నా బన్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్  చేసింది. ఆమె అల్లు అర్జున్ కి ఫ్యాన్ కాదు అంతకు  మించి అని చెప్పుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్పగా ఇరగదీశాడని చెప్పుకొచ్చింది. ఈసారి అవార్డు లని బన్నీ కే అని ధీమా వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఈసారి అల్లు అర్జున నేషనల్‌ అవార్డు కొడతాడు అని బన్నీ ఓ రేంజ్ లో  పొగడ్తలతో ముంచెత్తింది. ఇక హోస్ట్ మీకు బన్నీ ఇష్టమా..పుష్ప రాజ్ ఇష్టమా.. అని అడగ్గా.."నాకు నా పుష్ప రాజ్ నే ఇష్టం" అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. ఇక పుష్ప పార్ట్ 2 వచ్చే ఏడాది రెండో నెలలో ప్రారభం కానుందని డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: