ఈ రోజుల్లో కొంతమంది దర్శకుల దురదృష్టం ఎలా ఉంటుంది అంటే వారు చేసే సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. మంచి ఆదరణ తక్కువ ఉంటాయి. వారికి కూడా దర్శకత్వం పరంగా మంచి పేరు ను తీసుకు వస్తుంది. అయినా కూడా వారు తమ తదుపరి సినిమా విషయంలో కొంత కష్టపడాల్సి వస్తుంది. సూపర్ హిట్ కొట్టిన కూడా హీరోలు వారి పై నమ్మకం ఏర్పరుచుకోలేక పోతున్నారు. ఆ విధంగా ఇటీవల సీటీ మార్ చిత్రం తో సూపర్ హిట్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్న సంపత్ నందిసినిమా విషయంలో ఆలస్యం చేస్తూ ఉండటం ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.

మొదటి నుంచి గమనిస్తే ఆయన చిన్న దర్శకుడిగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఆ సినిమా ఆయనకు ఇచ్చిన విజయోత్సహం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోగా మధ్యలో అది మిస్ అయింది. దాంతో ఆయన రవితేజ తో బెంగాల్ టైగర్ అనే సినిమాను మొదలు పెట్టి మరొక సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ తో కలిసి గౌతమ్ నంద అనే సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సీటీ మార్ సినిమా చేయడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు మాస్ దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. అలా ఆయనకు పెద్ద హీరోల నుంచి మంచి అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ చిత్రం విడుదలయ్యి నాలుగైదు నెలలు దాటుతున్నా కూడా ఇంకా ఆయనకు కొత్త సినిమా ప్రకటించకపోవడం అందరిలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో సంపత్ నంది ఎప్పుడు తన తదుపరి సినిమా అనౌన్స్ మెంట్  ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: