టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త బయటికి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి ఒక భారీ అప్డేట్ రానుందట. చిరంజీవి, రామ్ చరణ్ లకు సంబంధించి విజువల్ వండర్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బహుశా వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో కూడా అయ్యుండొచ్చని టాక్ వినిపిస్తోంది.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం రోజు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి సినిమాపై మరోసారి అంచనాలను రెట్టింపు చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన చరణ్ ఇంట్రో టీజర్ కి..

భారీ ఎత్తున రెస్పాన్స్ లభించింది. దీంతో న్యూ ఇయర్ రోజున ఆచార్య టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతుందోనని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అలాగే బాబితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో చరణ్ మరో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: