తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా మంచి క్రేజ్, ఫాలోయింగ్, అవకాశాలతో దూసుకెళ్తున్న వారిలో కన్నడ భామ రష్మిక మందన్న కూడా ఒకరు అనే చెప్పాలి. తొలిసారిగా టాలీవుడ్ కి యువ దర్శకడు వెంకీ కుడుముల తీసిన చలో సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది రష్మిక. నాగ శౌర్య హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది.

అనంతరం విజయ్ దేవరకొండ తో పరశురామ్ తీసిన గీతా గోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక, అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు మూవీ ఛాన్స్ కొట్టి, దానితో కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఆపైన మరొక్కసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో నటించి దానితో కూడా సక్సెస్ కొట్టిన రష్మిక, ఆ తరువాత తమిళ హీరో కార్తీ తో సుల్తాన్ సినిమా చేసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప లో శ్రీవల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకుంది రష్మిక. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుండడంతో హీరోయిన్ గా రష్మిక రేంజ్ మరింతగా పెరిగింది.

అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే పలు బడా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ సినిమాల అవకాశాలు రష్మిక కి వరుసగా వస్తున్నాయి అని, అయితే తన డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ని బట్టి రష్మిక ఆ సినిమాలు ఒప్పుకుంటున్నారని సమాచారం. మొత్తంగా వరుసగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో గోల్డెన్ లెగ్ భామగా దూసుకెళ్తున్న రష్మిక అదృష్టం మాములుగా లేదని, ఒకవేళ ఇకపై చేస్తున్న సినిమాలతో ఆమె మరిన్ని సక్సెస్ లు అందుకుంటే హీరోయిన్ గా ఆమె రేంజ్ విపరీతంగా పెరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: