సాహో లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాతా డాళ్రింగ్ ప్రభాస్ వరుస సినిమాలను మొదలెట్టేశాడు. సాహో కేవలం ఫ్యాన్స్ ను మాత్రమే హ్యాపీ చేయడంతో ఇంకా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలని వెంటనే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒక మూవీ 'రాదేశ్యాం'. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయితే సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో ప్రమోషన్స్ మీద పడ్డారు. దీనికి సంబంధించి చిత్ర బృందం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆహా అనిపించే సన్నివేశాలతో, అధ్బుతమైన విజువల్స్ తో, ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్ తో, ఆసక్తిని పెంచే సంభాషణలతో ట్రైలర్ ఓ రేంజ్ లో వుంది.

ట్రైలర్ చూస్తుంటే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ ఈ సినిమాలో దొరికేలాగే ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది, రిలీజ్ అయిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతుంది.  అయితే ఈ సినిమా గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేమిటంటే అద్భుతమైన ఈ ప్రేమ కథా చిత్రంలో  హీరోయిన్ పాత్రను చనిపోతుంది అని, దాంతో హీరో పగ తీర్చుకోవడానికి  బయలుదేరగా కథ మరో మలుపు తిరుగుతుంది అని ఇలా  చాలా ఊహాగానాలే ఉన్నాయి. అయితే ట్రైలర్ విడుదలయ్యాక అర్దం అయ్యింది ఏమిటంటే...ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర దాదాపు చావు అంచులకు వెళ్తుంది.

కానీ హీరో ప్రభాస్ కాలంతో యుద్ధం చేసి ఆమెను రక్షిస్తాడు అని ఒక యాంగిల్ లో అనిపిస్తోంది. మొత్తానికి ఒక పెద్ద షిప్ లో జరిగే ప్రమాదానికి హీరో, హీరోయిన్లకు ఏదో సంబందం ఉందని సినిమాలో ఈ సన్నివేశం కీలకమని తెలుస్తోంది. మరి  ప్రేమ vs విధిగా కొనసాగే ఈ కథనంలో గెలుపెవరిది అనేది క్లియర్ గా తెలియాలంటే మాత్రం జనవరి 14 ను వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: