చిత్రం లో అనన్య తనకిష్టమైన స్నాక్స్ను తింటూ ఆనందిస్తున్నట్లు కన్పిస్తుంది. ఈ డోపమైన్ ఉత్పత్తి చేసే ఆహారమే మనకు కావలసినదంతా! డోపమైన్ సంతోషానికి కారణం. అంటే ఆమె పిక్ చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోవడం ఖాయం. వెంటనే పెదవులపై చిరునవ్వు పూస్తుంది. ఈ పిక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అనన్య పెద్ద హోప్ చెవిపోగులు ధరించి, ఆహారం తింటున్నప్పుడు కూడా అధునాతనంగా కనిపించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే అనన్య ఫ్రైస్ తో అందరి నోళ్లు ఊరిస్తోంది.
ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే... అనన్య పాండే ప్రస్తుతం 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రౌడీ హీరో విజయ్ సేతుపతి తో ఆమె చేసే రొమాన్స్ చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. 2022 ఆగష్టు 25న ఈ మూవీ పేక్షకుల ముందుకు రానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాతోనే అనన్య టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరో యష్ జోహార్, దర్శకుడు పూరీ జగన్నాధ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.