సాహో తర్వాత ప్రేక్షకులను తన పీరియాడికల్ ప్రేమ కథను చెప్పేందుకు వస్తున్నాడు విక్రమాదిత్య అదేనండి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బుట్ట బొమ్మ అందాల భామ పూజా హెగ్దే నటించింది. జనవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. అయితే ట్రైలర్ లో కొన్ని ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ను టెన్షన్ పడేలా చేస్తున్నాయి.

రాధేశ్యామ్ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా బడ్జెట్ లో దాదాపు గ్రాఫిక్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. బడ్జెట్ 250 కోట్ల దాకా పెట్టారు కాబట్టి సినిమాకు తప్పకుండా వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడి ఉండరని అనుకుంటున్నా సరే ట్రైలర్ లో చూపించిన షిప్ సీన్స్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం అసలకే మోసం వచ్చేస్తుందని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

అంతేకాదు సినిమాలో కృష్ణం రాజు నటించడం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎక్కడో తేడా కొడుతుంది. బిల్లాలో కృష్ణం రాజు నటించారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా ఇద్దరు కలిసి చేసిన రెబల్ నిరాశపరచింది. రాధేశ్యామ్ సినిమాలో కూడా పరమహంస పాత్రలో కృష్ణం రాజు నటిస్తున్నారు. మరి ఈసారి ఇద్దరు కలిసి ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. ఓ పక్క వారం ముందే ఆర్.ఆర్.ఆర్ కూడా రిలీజ్ అవుతున్న టైం లో రాధే శ్యాం అంచనాలకు ఏమాత్రం తగ్గినా సరే సినిమాపై భారీ ఇంప్యాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అన్నిటి గురించి డీటైల్డ్ గా థింక్ చేస్తున్నారు. ప్రభాస్ మ్యాజిక్ చేస్తే మాత్రం సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: