కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు హీరోలు ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరొక సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే వారు, కాకపోతే ప్రస్తుతం మాత్రం మన తెలుగు హీరోలలో చాలా మంది ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నారు, ఇలా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, లాంటి స్టార్ హీరోలు ఈ లిస్ట్ లో ఉండగా, ఈ లిస్టు లోకి గోపీచంద్ కూడా చేరిపోయాడు. ఈ మధ్య కాలంలోనే సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సీటి మార్ సినిమాతో బబాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి  అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే గోపీచంద్ మరో సినిమా ను చేయబోతున్నాడు, గోపిచంద్, శ్రీవాసు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి, ఇది వరకే గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి, ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇది హైట్రిక్ సినిమా, ఈ సినిమాకు భూపతి రాజా కథను అందించాడు, ఇలా ఇప్పటి వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమాపై గోపీచంద్ అభిమానులు ఇప్పటి నుండే అంచనాలను పెంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: