సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటించిన పోయినా.. తాను చేసిన కొన్ని సినిమాలతోనే  స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది సాయిపల్లవి. ఇక తాజాగా 'శ్యామ్ సింగరాయ్' సినిమా రూపంలో సాయి పల్లవి మరో సక్సెస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సాయిపల్లవి సంపాదన ఇతర హీరోయిన్లు సమంత, అనుష్క ల కంటే దీటుగా ఉన్నట్లు సమాచారం. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఆ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది సాయిపల్లవి.

ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా సాయి పల్లవి కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక సాయి పల్లవి నటిస్తున్న సినిమాల బిజినెస్ కూడా బాగా జరగడంతో పాటు డబ్బింగ్ హక్కు సైతం భారీ ధరకు అమ్ముడు పోతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఈమె టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక తాజాగా ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే తాజాగా ఒక సర్వే ప్రకారం ఈ ఏడాది సాయి పల్లవి ఏకంగా 3 మిలియన్ల డాలర్లను సంపాదించింది. నిజానికి సాయి పల్లవి తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న కూడా ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఇతర హీరోయిన్లకు ధీటుగా సంపాదిస్తుంది.

ఇక పెద్ద సినిమా అయినా రీమేక్ సినిమా అయినా పాత్ర నచ్చకపోతే దాన్ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరిస్తుంది. ఈ క్రమంలోనే గత మూడేళ్లలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలను రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి. ఇక యాడ్స్, రీమేక్ సినిమాలో నటించి ఉంటే సాయి పల్లవి సంపాదన ఇంకా ఎక్కువ ఉండేది. మొత్తంగా కేవలం ఈ ఒక్క ఏడాది మాత్రమే సాయిపల్లవి మూడు మిలియన్ డాలర్లు సంపాదించాలంటే అది మామూలు విషయం కాదు. ఇక తెలుగులో సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న విరాట పర్వం సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సాయి పల్లవి ఫాన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. దీంతో అటువైపు కూడా సాయి పల్లవి అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: