చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసి సరైన స్టార్ డమ్ రాక ఎంతో మంది హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటే.. ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో లంగా వోని లో ఎంతో అందంగా కనిపించిన కృతి శెట్టి తన కోర చూపుల తో ఎంతో మంది యూత్ ని తన వైపుకు తిప్పుకుంది. అదేసమయంలో దర్శకనిర్మాతలు చూపు కూడా ఈ అమ్మడి పై పడింది.


 దీంతో ఇక ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.. వరుస అవకాశాలు ఈ అమ్మడి ముంగిట  వచ్చి క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవలే నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి అనే పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే తాను బోల్డ్ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.



 ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏం చేసినా వృత్తిపరంగానే మేము  చేస్తూ పోతుంది. అచ్చంగా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లలో ఎలా అయితే కష్టపడతామో.. అటు బోల్డ్ సీన్లలో కూడా అలాగే కష్టపడతాము అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఇక అన్ని సీన్లలో ఒరిగిపోయి నటించినట్లు గానే బోల్డ్ సీన్స్ లో కూడా నటిస్తానని తెలిపింది. కథలో పాత్రకు బోల్డ్ సీన్స్ అవసరం అనిపిస్తే చేయడానికి సిద్ధమవుతా లేదంటే బోల్డ్ గా నటించడానికి అస్సలు ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ఇప్పటికే వరుస ఆఫర్లు క్యూ కడుతూ ఉండగా ఇక బోర్డ్ పాత్రలో కూడా నటిస్తానని చెప్పడంతో  మరిన్ని అవకాశాలు ఈ అమ్మడి ముంగిట వాలే చాన్స్ కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: