అందాల ముద్దుగుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల పలకరించింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి,  అందులో భాగంగా వరుస సినిమాల్లో నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను సమంత ప్రేమించి పెళ్ళాడింది,  వీరిద్దరికీ కొంత కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి, అయితే విడాకులు అయిన తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ పెంచింది, అందులో భాగంగా సమంత యశోద అనే సినిమాలో నటిస్తోంది.

 శ్రీదేవి మూవీస్‌ పతాకం పై ప్రొడక్షన్ నంబర్ 14 గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ఈ మూవీ తో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా యశోద సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది, ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యిన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేస్తాం, ఈ నెల 6 వ తేదీన యశోద సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాం, 24 వ తేదీ తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. సమంత తో పాటు ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులపై హైద‌రాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం అన్నారు, ఇలా సమంత సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: