పండుగ ఏదైనా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటేనే అది ఆనందం. పండుగ ఉత్సాహం రెట్టింపు చేసేలా ఫ్యామిలీ అంతా కలిస్తే ఆ జోష్ వేరేలా ఉంటుంది. ఇక తాము ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కూడా పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో అందరం సమానమే అనేలా ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు ప్రతి ఫెస్టివల్ కి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. అన్ని పండుగల్లానే క్రిస్మస్ రోజు కూడా మెగా హీరోలంతా ఒకచోట చేరి పార్టీ చేసుకున్నారు.

క్రిస్మస్ నైట్ పార్టీ అంటూ చరణ్ తన ఇన్ స్టాగ్రాం స్టోరీస్ లో షేర్ చేశాడు. ఇందులో మెగా హీరోలంతా పాల్గొన్నారు. అయితే ఫోటోలో చిరు, నాగబాబు మాత్రం మిస్ అయ్యారు కానీ మెగా హీరోలైన చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా ఇలా పండుగ టైం లో ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకుంటే వచ్చే ఆ కిక్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

పుష్ప హిట్ అయిన ఆనందంలో అల్లు అర్జున్, ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో చరణ్ ఉన్నారు. మరోపక్క సాయి ధరం తేజ్ తన హెల్త్ పూర్తిగా రికవర్ అయినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు. మొత్తానికి క్రిస్మస్ రోజు అందరు కలిసి దిగిన ఈ పిక్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. క్రిస్మస్ పార్టీ పిక్ లో చిరు, నాగబాబు కూడా ఉంటే ఇంకాస్త బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉంటే ఇంకా క్రేజీగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. పండుగ రోజు మెగా హీరోలంతా కలిసి ఇచ్చిన ఈ మెగా ట్రీట్ కు మెగా ఫ్యాన్స్ లో కూడా డబుల్ జోష్ వచ్చిందని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: