నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి,  మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్, ఈ సినిమాకు టాక్సీ వాలా మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహించాడు, ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండి జనాలలో మంచి అంచనాలను నెలకొల్పింది.  ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి విజయం వైపు దూసుకుపోతోంది, ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపించగా, సాయి పల్లవి దేవదాసి పాత్రలో అలరించింది,  అలాగే ఉప్పెన సినిమాలో చాలా సాఫ్ట్ గా కనిపించినా కృతి శెట్టి ఈ సినిమాలో మాత్రం మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తుంది.  అయితే శ్యామ్ సింగరాయ్ తాజాగా థియేటర్ లలో విడుదలై మంచి విజయం వైపు దూసుకుపోతున్న సందర్భంగా కృతి శెట్టి మీడియాతో ముచ్చటించింది.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కృతి శెట్టి మాట్లాడుతూ.. బోల్డ్ సీన్స్ అంటే చాలా మంది బ్యాడ్ అని అనుకుంటారు, మేము ఏం చేసినా కూడా అది వృత్తి పరంగానే చేస్తాం. యాక్షన్ సన్నివేశాలకు ఎంత కష్టపడతమో సినిమాలో అన్ని సన్నివేశాలను కూడా అంతే కష్టపడి నటిస్తాము, ఆ కథలో ఆ సన్నివేశాలు అవసరం అనుకుంటేనే చేస్తాను, లేదు అంటే ఆ సన్నివేశాలు చెయ్యను. శ్యామ్ సింగరాయ్ సినిమాలో వాటితో కథ ముడి పడి ఉంది అని కృతి శెట్టి తెలియజేసింది. ఇది ఇలా ఉంటే కృతి శెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే,  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం రామ్ పోతినేని సరసన ఓ సినిమాలో  నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: