టాలీవుడ్ లో ఎందరో సెలబ్రిటీలు ప్రేమ వివాహాలు చేసుకోగా కొందరు మాత్రం తమ వ్యక్తిగత జీవితంలో వచ్చిన వివాదాల కారణంగా విడిపోయారు. అయితే వారిలో మొదటగా చూస్తే మనల్ని ఎక్కువగా బాధిస్తున్న విషయం నాగ చైతన్య - సమంత లు జంట విడిపోవడం. ఇటీవలే ఈ బిగ్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ జంట విడిపోయిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా వీరు విడిపోవడం అనేది అభిమానులను చాలా బాధిస్తోంది ఇప్పటికీ వారు ఆ బాధ నుండి బయట పడలేకపోతున్నారు.
అలాగే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారు. ముందుగా లలితా కుమారిని అనే ఆమెను వివాహం చేసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తరవాత  2009లో ఆమెకు విడాకులు ఇచ్చి 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనీ వర్మను రెండో పెళ్లి చేసుకున్నారు .

ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా తన తొలి భార్యతో విడిపోయి రెండో వివాహం చేసుకున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‏ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా  2004లో భార్యకు విడాకులు ఇచ్చి భరణంగా తన సగం ఆస్తిని రాసిచ్చారు సైఫ్. అనంతరం 2012లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‏ను రెండో పెళ్లి చేసుకున్నారు.
 ఇటీవలే సింగర్ సునీత కూడా రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  ముందుగా ఈమెకు కిరణ్‏తో వివాహం కాగా వీరికి శ్రేయ, ఆకాష్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కిరణ్ తో విడాకుల తీసుకున్న తర్వాత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం ఎంతో ఘనంగా చేసుకున్న  విషయం తెలిసిందే. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే ఇంకా ఎన్నో సంఘటనలు ఇలా జరుగుతుంటాయి. కానీ ఎవరికి కర్మకు ఎవ్వరూ బాధ్యులు కారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: