నవీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నా..అంతకంటే ముందే కొన్ని సినిమాలు చేసి తనదైన స్టైల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ అనే సినిమాతో హీరోగా ఎంటీ ఇచ్చి తనకంటూ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఇక ఆ తర్వాత కొంతకాలం అడ్రెస్ లేకుండా పోయాడు. మళ్లీ పవర్ ఫుల్ కం బ్యాక్ తో జాతిరత్నాలు అనే సినిమాతో మన ముందుకు వచ్చి..బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నవీన్. ఇక ఈ సినిమా లో ఆయన పర్ ఫామెన్స్ చూసి నవ్వని మనిషి అంటూ ఉండరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో కామెడీ టైమింగ్స్ తో పంచులు వేసే నవీన్ కి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక జాతిరత్నాలు సినిమా  తర్వాత ఈ హీరో ఎలాంటి సినిమా తీస్తాడా అని  అభిమానులు చర్చించుతుండగా..సోషల్ మీడియాలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. నవీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూవీ క్రీయేషన్స్ లో రాబోతుంది..ఆ సినిమాలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ అనుష్క నటించబోతుంది అంటూ ఓ న్యూస్ తెగ  వైరల్ గా మారింది. కానీ  ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా  గురించి ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేసారు. సీన్ కట్ చేస్తే.. కొన్ని రోజుల తరువాత అంటే ఈ రోజు నవీన్ పుట్టినరోజు సంధర్భంగా  అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.

ఎట్టకేలకు నవీన్ పోలీశెట్టి తదుపరి సినిమా పై క్లారిటీ ఇచ్చేశారు చిత్ర మేకర్స్. నవీన్ పోళిశెట్టి కీలక పాత్రలో అనుష్క శెట్టి లీడ్ రోల్ లో .. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ మూవీ రాబోతున్నట్లుగా మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. ఈ గుడ్ న్యూస్ ను నవీన్ పోలీశెట్టి పుట్టిన రోజున తెలపడంతో అభిమానులు మరింత హ్యాపీగా ఉన్నారు. ఇక లీక్ అవుతున్న సమాచారం బట్టి..'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కధ ఏమిటంటే ఓ 20 ఏళ్ల యువకుడికి  40 ఏళ్ల మహిళ నచ్చితే వచ్చే ప్రాబ్లం గురించి తెర పై చూపించబోతున్నట్లు తెలుస్తుంది. 20 ఏళ్ల యువకుడు 40 ఏళ్ళ ఆంటీని ప్రేమిస్తే ఎలా ఉంటుందనేది ఈ మూవీ స్టోరీ అంటూ టాక్ వినిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: