ఉప్పెన సినిమాతో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కృతి శెట్టి తన సెకండ్ సినిమా శ్యామ్ సింగ రాయ్ తో షాక్ ఇచ్చింది. నానికి జంటగా కీర్తి పాత్ర లో నటించిన కృతి శెట్టి సినిమాలో కొద్దిగా బోల్డ్ అటెంప్ట్ చేసింది. రెండో సినిమాకే అమ్మడు ఇలా రెచ్చిపోయిందేంటి అని అందరు షాక్ అవగా పాత్రకు తగినట్టుగా చేయడం నటిగా నా ధర్మ అనేస్తుంది కృతి శెట్టి.

ఉప్పెన హిట్ కాగానే దాదాపు అరడజను సినిమాల దాకా అమ్మడి ఖాతాలో పడ్డాయి. వాటిలో ఏ సినిమాలో ఎలాంటి పాత్రతో వస్తుందో ఏమో కాని రెండో సినిమా శ్యాం సింగ రాయ్ తోనే లిప్ లాక్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది అమ్మడు. ఓ విధంగా కృతి శెట్టిని ఇష్టపడే ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ఉంటుంది. హీరోయిన్ అన్న తర్వాత అన్ని పాత్రలు చేయాలి కృతి ఏమి అందులో స్పెషల్ కాదు కదా అనుకోవచ్చు. కాని కొంతమంది హీరోయిన్స్ తమకు ఎన్ని కోట్లు ఇచ్చినా కొన్ని సన్నివేశాల్లో నటించలేదు.

అలాంటి వారిలో కృతి శెట్టి ఉంటుందని అనుకున్నారు. కాని ఆమె సెకండ్ సినిమాకే లిప్ లాక్ కానిచ్చేసింది. అంతేకాదు దాన్ని సమర్ధించుకుంటూ పాత్ర స్వభావాన్ని బట్టి తాను అలా చేశానని.. ఇక మీదట కూడా చేస్తానని అన్నది అమ్మడు. అయితే రెండు సినిమాలకే తాను చేయాల్సిన పాత్రల గురించి కృతి శెట్టి చాలా క్లారిటీగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు, నితిన్, రామ్ లింగుస్వామి కాంబో మూవీ, నాగ చైతన్య సినిమాల్లో కూడా కృతి శెట్టి ఛాన్స్ అందుకుంది. రాబోతున్న సినిమాలన్ని క్రేజీ గా ఉండగా టాలీవుడ్ లో ఉప్పెన భామ స్టార్ డం తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: