నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాతో ఊపందుకున్న బాలయ్య ఇప్పుడు ఏ మాత్రం తగ్గకుండా మిగిలిన సినిమాలకు వేగం పుంజుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తీయడానికి డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. అయితే గోపీచంద్ మలినేని తోనే కాకుండా బాలయ్య ఇంతకుముందు అనిల్ రావిపూడి తో కలిసి ఒక సినిమా డేట్ ఫిక్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అనిల్ రావిపూడి డి ఎఫ్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. అయితే బాలయ్య తో సినిమా డేట్ ఫిక్స్ చేసుకున్న ఈయన జనవరి నుండి షూటింగ్ పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది.

 సినిమా షూటింగ్ ప్రారంభించడమే ఆలస్యం కూడా ఎప్పుడో రెడీ అయిపోయింది. ఇక బాలయ్య షూటింగ్ రంగంలోకి దిగడమే ఆలస్యం. ఈ షూటింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనిల్ రావిపూడి. కానీ బాలయ్య మాత్రం అనిల్ రావిపూడి కి ఇంకా ఖచ్చితమైన డేట్ ఇవ్వలేదు ఇచ్చే పొజిషన్ కూడా ఎప్పుడో కనిపించడం లేదు. గోపీచంద్ మలినేని కి మాత్రం వరుస డేట్లు ఇచ్చాడు బాల్లయ్య. కాబట్టి బాలయ్య డేట్ కోసం అనిల్ రావిపూడి వెయిట్ చేయక తప్పదు. అయితే తాజాగా బాలయ్య కి అనిల్ కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఏది ఏమైనా కథ ఓకే అయిన తర్వాత హీరో డేట్స్ కోసం అయిదు నుండి ఆరు నెలలు ఆగడం అంటే ఏ స్టార్ హీరో కైనా కష్టంగానే ఉంటుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి ఒక మంచి స్టార్ డైరెక్టర్. ఇక అనిల్ రావిపూడి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు అనిల్ రావిపూడి. ఎన్ని నెలలైనా బాలయ్య కోసం నేను వెయిట్ చేస్తాను ఏదేమైనా సినిమా తర్వాత బాలయ్య మరింత పెరిగిపోయింది దీనితో ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన స్పష్టం చేశారు. అఖండ సినిమా ముందు వరకు ఆయన రేంజ్ వేరు కానీ అఖండ సినిమా తర్వాత ఆయన అదే వేరే లెవెల్ కి పెరిగిపోయింది. ఏపీలో టికెట్ల ధరలు అమాంతం తగ్గించినా కూడా బాలయ్య టార్గెట్ మాత్రం తగ్గలేదు. ఏదేమైనా పుష్ప సినిమాకి టికెట్ల ధరలు కలిసి వచ్చినట్లు బాలయ్య సినిమాకి కూడా కలిసి వస్తే బాలయ్య రెండు వందల కోట్ల మార్క్ ను దాటి వాడేమో... అఖండ సినిమా తర్వాత నుండి బాలయ్య యాక్షన్ని అభిమానులు ఎక్కువగా ఆశిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: