స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరో భర్తగా మారబోతున్నారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు మన నాగ శౌర్య. అయితే కీర్తి సురేష్ కి భర్త గా మారుతుంది రియల్ లైఫ్ లో కాదండోయ్..! రీల్ లైఫ్ లో మాత్రమే.. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బోలా శంకర్'. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం వేదాళం కి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది.

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కి భర్త పాత్ర కూడా ఉంటుందట. ఇప్పుడు ఆ పాత్ర కోసం యంగ్ హీరో నాగ శౌర్య ని చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్ ఈ పాత్ర విషయమై నాగశౌర్య ను సంప్రదించగా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో వెంటనే నాగశౌర్య నటించడానికి ఓకే చెప్పాడట. అంతేకాదు త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ దగ్గర నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

కాగా ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళ్లింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. ఇక దర్శకుడు మెహర్ రమేష్ ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పక్కాగా స్క్రిప్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: