టాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా లైగర్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ తీస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ కి తల్లిగా ఈ సినిమాలో కనిపించనున్నట్లు టాక్.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ తో కలిసి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ రాగా, ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న ఉదయం విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే విషయం ఏమిటంటే, త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ అదిరిపోతుందని, అది చూసిన అనంతరం రౌడీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ కూడా లైగర్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడుతాయని ఇన్నర్ వర్గాల సమాచారం.

ఇక ఈ సినిమాలో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ పాత్ర కోసం శారీరకంగా ఎంతో శ్రమించారని, అలానే దర్శకడు పూరి జగన్నాథ్ సహా టీమ్ మొత్తం కూడా రేయింబవళ్లు లైగర్ కోసం ఎంతో కరంగా శ్రమిస్తోందని, తప్పకుండా రిలీజ్ తరువాత తమ శ్రమకి తగ్గ ఫలితం ప్రేక్షకులు అందిస్తారని నమ్మకాన్ని మూవీ యూనిట్ వ్యక్త పరుస్తోందట. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రతో పాటు సినిమాలోని కీలక యాక్షన్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని, అలానే మూవీ కూడా మంచి రేసీగా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా జెట్ స్పీడ్ తో సాగేలా ఎంతో అద్భుతంగా దర్శకుడు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ ని రాసుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రిలీజ్ తరువాత లైగర్ అదరగొట్టడం ఖాయంగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 25 న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: