టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ హీరోకు వెంకీ కుడుముల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన  ఛలో సినిమాతో  బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు,  ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే వరస సినిమాల్లో నటించిన ఈ హీరోకు  ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలు దక్కలేదు,  ఈ మధ్య కూడా వరుడు కావలెను, లక్ష్య వంటి సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నాగ శౌర్య కు ఆ సినిమాలు కూడా ఈ హీరోకు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. ఇలా హీరోగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన నాగ శౌర్య కు ఒక అదిరిపోయే ఆఫర్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, అసలు విషయం లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బోలా శంకర్, ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.

చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది, తమిళ వర్షన్ లో కీర్తి సురేష్ పాత్రను లక్ష్మీ మీనన్ చేసింది, ఈ క్యారెక్టర్ కు  భర్తగా తమిళ్ లో అశ్విన్  కాకుమాను నటించాడు, తమిళ్ వెర్షన్ లో శృతి హాసన్ తమ్ముడు పాత్ర ఇది,  తెలుగులో ఇదే పాత్ర కోసం నాగ శౌర్య ను బోలా శంకర చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో తెలియదు కానీ,  మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే నాగ శౌర్య నో చెప్పే  అవకాశాలు లేవని కొంత మంది అభిప్రాయపడుతున్నారు, ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: