ఇప్పుడు తెలుగు సినిమా అనడం కంటే పాన్ ఇండియా సినిమా అనడం కరెక్ట్ అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో రాబోతున్న కొన్ని సినిమాలు ముందు కేవలం తెలుగు వరకే అనుకున్నా ప్లాన్ మార్చి పాన్ ఇండియా సినిమాగా ఫిక్స్ చేసుకున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట కూడా ఉంటుందని టాక్. గీతా గోవిందంతో హిట్ అందుకున్న పరశురాం తీస్తే స్టార్ తోనే సినిమా తీయాలని వెయిట్ చేసి మరి మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

సర్కారు వారి పాట ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే తెలుగు సినిమాకు నార్త్ లో పెరుగుతున్న ఆదరణ చూసి సర్కారు వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మహేష్ కూడా అందుకు ఓకే అని చెప్పినట్టు టాక్. రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని అనుకున్న మహేష్ సర్కారు వారి పాట యూనిక్ సబ్జెక్ట్ అవడంతో ఈ సినిమాతోనే అలా ఫిక్స్ అయ్యాడట.

నిజంగానే సర్కారు వారి పాట పాన్ ఇండియా రిలీజ్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మహేష్, కీర్తి ల పెయిర్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మత్రి మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. బ్యాంక్ స్కాం ల నేప్థ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ అయితే నార్త్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి సర్కారు వారి పాటతో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ షురూ అవుతుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: