టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను తన కుటుంబానికి ఇస్తాడు. తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన భార్యా, పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు. మరి అలాంటి ఎన్టీఆర్ తన భార్య ప్రణతిని 'చంపేస్తా.. అంటూ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? అనేది తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే... ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల కి మే 5 న 2011 లో వివాహం జరిగింది. ఇక ఇద్దరికీ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు కుమారులు. అయితే ఎన్టీఆర్ రభస సినిమా చేస్తున్న సమయంలో లక్ష్మీపతి గర్భవతి. ఆ సమయంలో భార్య తోనే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ అనుకున్నాడట.

కానీ తప్పని పరిస్థితులవల్ల రభస సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. అయితే షూటింగ్ సమయంలో కూడా తన భార్యతో వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు తారక్. అలా ఓసారి ప్రణతి తో వీడియో కాల్ మాట్లాడే సమయంలో ఆమెలో కొంచెం తేడా కనిపించిందట. దీంతో కంగారుపడిన ఎన్టీఆర్ 'నిన్ను చంపేస్తాను.. నేనింకా ఇక్కడే ఉన్నాను.. నువ్వు అప్పుడే కనెయ్యకు.. నేను వచ్చేవరకు ఆగు' అని అనేసరికి, లేదు లే ఇప్పుడు బాగానే ఉందని ప్రణతి చెప్పిందట అయినా కూడా ఎన్టీఆర్ కి కంగారు మాత్రం పోలేదంట. కొంత సమయం తర్వాత మళ్లీ కాల్ చేయగా హాస్పిటల్ కి వెళ్తున్నామని ప్రణతి చెప్పిందట. 

అయితే ఎన్టీఆర్ టెన్షన్ పడకుండా ఉండటానికి హాస్పిటల్ కి చెకప్ కోసం వెళుతున్నానని అబద్ధం చెప్పిందట ప్రణతి. కానీ అప్పటికే తన భార్య పరిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ వెంటనే బయలుదేరి హాస్పిటల్ కి చేరుకున్నాడట. అయితే అప్పటికే లక్ష్మీప్రణతి అభయ్ రామ్ కి జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఇటీవల ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తాను నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: