బాలీవుడ్ లో జరిగే వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ఈ ఏడాది బీ టౌన్ సెలబ్రిటీలు చిక్కుల్లో  పడిన సంగతి కూడా తెలిసిందే. యావత్ భారతదేశంలో చాలా రోజులు అదే హాట్ టాపిక్ గా నిలిచింది.

కంగనా రనౌత్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్  అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈమె ఇప్పుడు వివాదాలకు అతి దగ్గరగా ఉంటుంది. ఇక తన మాటల ద్వారా తన ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉండనే ఉంటుంది. మామూలు వివాదాల లోనే కాకుండా తను ప్రధానమంత్రి మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హల్ చల్ చేసింది. ఇకపోతే  కొడుకు ఫర్హన్‌ అక్తర్‌ ను పరుష పదజాలంతో  దూషించింది కంగనా. దీనికి తన తండ్రి ముంబై కోర్టులో పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. అర్జీ ని తిరస్కరించిన కోర్టు వారు చెప్పిన సమయానికి కోర్టులో హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు.

ఐశ్యర్య రాయ్:  5 సంవత్సరాల క్రితం ఐశ్వర్యారాయ్ కేసు సునామి సృష్టించింది. 'పనామా పేపర్స్‌' కేసులో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేయడం జరిగింది. దాని తర్వాత తనను సుమారు 6 గంటల పాటు ప్రశ్నలు అడిగారు అధికారులు. అయితే అదే క్రమంలో ఐశ్వర్య రాయ్ పలు డాక్యుమెంట్లను అందించారు. అయితే ఫారెన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు దర్యాప్తు చేసి వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ఈ విషయం అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌:  మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా మారిన సుకేష్‌ చంద్రశేఖర్ పోలీస్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌  కూడా భాగమని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. ఇక ఈ కేసులో తనని పలుమార్లు ఈడీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దాదాపుగా సురేష్ దగ్గర నుంచి 10 కోట్ల విలువైన బహుమతులను తను తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ విషయమై అప్పట్లో బాగా ఫేమస్ అయింది...!!



మరింత సమాచారం తెలుసుకోండి: