నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదలై సూపర్ హిట్ ను సాధించింది. దాదాపు 115 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పవచ్చు. కేవలం 25 రోజులలోనే ఈ స్థాయిలో వసూళ్లను సాధించింది అంటే యాభై రోజుల సమయానికి మరి 150 కోట్ల వసూళ్లు సాధిస్తుంది అని చిత్రబృందం భావిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణతో మూడవ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకోవడానికి ముఖ్య కారణం అని చెప్పాలి.

సినిమా విజయంతో మళ్లీ పూర్వవైభవం రావాలని చేయగా ఇప్పుడు ఇద్దరు తమ భవిష్యత్తు సినిమాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందుకే వీరిద్దరు కూడా తమ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తుండగా ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాది మొదలుపెట్టి అదే ఏడాది విడుదల చేసే విధంగా ప్రణాళిక వేసుకున్నాడు.

ఆ విధంగా వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలకృష్ణ మరో మూడు సినిమాలను కూడా అనౌన్స్ చేసి వాటిని ఆపై వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇటు బోయపాటి శ్రీను కూడా తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించగా ఆయన రెస్పాన్స్ గురించి ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించాలని బోయపాటి శీను భావిస్తుండటం అల్లు అర్జున్ సినిమా ఓకే అనేలా చేయడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: