కృతి శెట్టి.. ఈమధ్య ఈమె క్రేజ్ భారీగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 21 2003 లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జన్మించిన కృతి శెట్టి నాన్న పేరు కృష్ణ శెట్టి.. అమ్మ పేరు నీతి శెట్టి. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు బాలనటిగా ఐడియా ,షాప్పర్స్ స్టాప్ , పార్లే, లైఫ్ బాయ్, బ్లూస్టార్ వంటి కొన్ని వాణిజ్య సంస్థల యాడ్స్ లో కూడా నటించింది. అప్పుడప్పుడే చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ మొదలుపెట్టిన ఈమెకు 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన హిందీ సినిమా సూపర్ 30 సినిమాలో విద్యార్థి గా నటించే అవకాశాన్ని కొట్టేసింది.

ఇక తెలుగులో 2021లో ఉప్పెన అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించింది. మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకున్న కృతి శెట్టి వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నాని హీరోగా శ్యామ్ శింగరాయ్ సినిమాలో సాయి పల్లవి తో కలిసి నటిస్తోంది ..అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు సిద్ధంగా లేదు..ఇప్పుడు తాజాగా మరో సినిమా లో నటించింది. ఇక మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి  సిద్ధంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా  అధికారికంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రకటించడం జరిగింది. థియేటర్లలో విడుదల చేస్తాము అని ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: