సమంత సినీ కెరీర్‌ మొదలు పెట్టి 10 ఏళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో మొన్నటి వరకు ఐటమ్ సాంగ్స్  వైపు మొగ్గుచూపలేదు. అయితే తొలిసారి 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేసింది. "ఉ అంటావా.. ఉఊ అంటావా" అనే పాటకు నాటు స్టెప్పులేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సాంగ్ కోసం సమంత దాదాపు కోటి రూపాయలు తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.  

పూజా హెగ్డే టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది. సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తూ బీటౌన్‌ స్టార్ హీరోయిన్‌గా మారుతోంది. ఇక ఈ బ్యూటీ కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. 'రంగస్థలం'లో జిగేలురాణిగా మాస్‌ స్టెప్పులేసింది. ఇక ఈ సాంగ్‌కి పూజా 50 లక్షలు తీసుకుందని తెలుస్తోంది.

తమన్నా వయసు 30ఏళ్లు దాటాక.. నిజంగా చెప్పాలంటే అవకాశాలు తగ్గిపోయాయి. స్టార్ హీరోలు ఎక్కువ శాతం పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తమన్నా ఐటెమ్ సాంగ్స్‌ కు ప్రియారిటీ ఇస్తోంది. ఒకవైపు అరకొరగా వస్తున్న హీరోయిన్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే 'అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, కెజిఎఫ్-చాప్టర్1, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ తో కుర్రకారు మతులు పోగొట్టింది తమన్నా.  

ఇక కలువకళ్ల సుందరి కాజల్‌.. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. కానీ పెళ్లికి ముందులా ఆమెకు ఆఫర్లు రావడంలేదు. అరకొర వచ్చే సీనియర్ల సినిమాలతోనే అడ్జస్ట్ అవుతోంది. అయితే కాజల్ తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్ చేసింది. 'జనతాగ్యారేజ్' లో పక్కాలోకల్‌ అంటూ ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది ఈ కలుకళ్ల సుందరి. చూద్దాం... ఇంకెందరు హీరోయిన్లు.. ఈ ఐటమ్ సాంగ్స్ వైపు ఆసక్తి చూపిస్తారో.



 


మరింత సమాచారం తెలుసుకోండి: