టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, మొదటి సినిమాలోనే అదిరిపోయే కామెడీని వెండితెరపై పండించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు, ఆ తర్వాత కూడా తన సినిమాలలో కామెడీనే ప్రధాన అస్త్రంగా వాడుతూ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. అలా కామెడీ సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కి 2019 లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, కలెక్షన్ ల వర్షం కురిపించిన ఎఫ్ టు సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ త్రీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు,  ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లు నటిస్తున్నారు.

సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి, నందమూరి నట సింహం బాలకృష్ణ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా ఆల్రెడీ ఓకే అయినట్లు తెలుస్తుంది.  అయితే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ తో అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయితే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మాస్ యాక్షన్ మూవీ ని దసరాకు  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నారు, అందువలన దాదాపు ఆరు నెలలకు పైగా అనిల్ రావిపూడి ఖాళీగా ఉండవలసి వస్తుంది, అందువలన ఈ ఖాళీ సమయంలో ఒక యంగ్ స్టార్ హీరో తో సినిమా చేయాలనే ఆలోచనలో ఈ అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తుంది, అందులో భాగంగా అనిల్ రావిపూడి, నితిన్ తో లేదా రామ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: