సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెరిగేలా చేశాయి, ఇలా జనాల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయకుండా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే మహేష్ బాబుకు చిన్న సర్జరీ జరగడం వల్ల కొంత కాలం రెస్ట్ తీసుకొని ఫిబ్రవరి వరకు సర్కార్ వారి పాట సినిమా పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాలి అని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లాన్ చేసుకున్నాడట, కాకపోతే సర్జరీ నుండి మహేష్ బాబు త్వరగా  కోలుకుంటు ఉండడంతో అనుకున్న దాని కంటే ముందుగానే సర్కార్ వారి పాట సినిమాను ముగించేసి ఆ తర్వాత వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: