బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాతో తన క్రేజ్ ఇమేజ్ డబుల్ ట్రిపుల్ చేసుకున్నాదని చెప్పొచ్చు. అంతకుముందు కేవలం తెలుగు హీరో మాత్రమే అనిపించిన ప్రభాస్ బాహుబలి వల్ల ఇండియన్ స్టార్ అయ్యాడు. బాహుబలితో విదేశాల్లో కూడా ప్రభాస్ క్రేజ్ పెరిగింది. అక్కడ కూడా ఆయనకు సూపర్ ఫాలోయింగ్.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా జపాన్ లో బాహుబలి రికార్డులు సృష్టించింది. అందుకే అక్కడ ప్రభాస్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా అక్కడ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేంద్దుకు అక్కడ కొందరు వెరైటీ ప్రయత్నాలు చేస్తున్నారు. జపాన్ లో ఓ కూల్ డ్రింక్ బాటిల్ పై ప్రభాస్ పోస్టర్స్ కనిపించాయి. వుయ్ లవ్ ప్రభాస్ అండ్ మిల్క్ అని దానిపై రాసి ఉంది. జపాన్ లో ప్రభాస్ క్రేజ్ కు ఇదే సాక్ష్యమని చెప్పొచ్చు. హేమాహేమీలు కూడా సాధించలేని ఈ అరుదైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. ఖచ్చితంగా అక్కడ ప్రభాస్ ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు.

ఇక రాధే శ్యామ్ సినిమా విషయానికి వస్తే సినిమాబ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రాబోతుంది. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. ఇద్దరి పెయిర్ స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తుంది. రాధేశ్యాం ప్రభాస్ టార్గెట్ భారీగానే ఉందని తెలుస్తుంది. సినిమా ఆడియెన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు. రాధే శ్యామ్ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. సినిమా ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి నచ్చేస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు డైరక్టర్ రాధాకృష్ణ.


మరింత సమాచారం తెలుసుకోండి: