యువ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న తాజా సినిమా లైగర్. విజయ్ ఈ సినిమాలో ఒక ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపిస్తుండగా బాలీవుడ్ నటి అనన్య పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఇందులో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, విజయ్ కి తల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో అధికారికంగా రిలీజ్ చేసింది యూనిట్. ఇక టీజర్ లో తన మార్క్ స్టైల్, పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన విజయ్, తప్పకుండా ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టితీరుతారని పలువురు ఆయన అభిమానులు అంటున్నారు. మరోవైపు పూరి మార్క్ టేకింగ్, డైలాగ్స్ టీజర్ లో ఆకట్టుకున్నాయి.

లైగర్ టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ సొంతం చేసుకుంటూ ఉండడంతో టీమ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే విషయం ఏమిటంటే మంచి యాక్షన్ తో కూడిన సినిమాగా తెరకెక్కుతున్న లైగర్ లో యాక్షన్, ఫైట్స్, అదిరిపోయే విజువల్స్ మాత్రమే కాకుండా హృదయానికి హత్తుకునే మంచి ఎమోషన్ కూడా ఉందని, ముఖ్యంగా సినిమాలో తల్లికొడుకులుగా నటిస్తున్న విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ ల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ మనసుని తాకుతాయని సమాచారం. మొత్తంగా టీజర్ తో అందరి నుండి సూపర్ రెస్పాన్స్ అందుకున్న లైగర్, 2022 ఆగష్టు 25న ఎంతో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మరి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: