టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు కి జోడీగా స్టార్ నటీమణి కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ టీజర్ అన్ని కూడా అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మహేష్ బాబు ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు టాక్.

వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమాని కొన్ని కారణాల వలన ఏప్రిల్ కి వాయిదా వేశారు. అయితే విషయం ఏమిటంటే జనవరి నుండి మూవీ సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం అంటూ సర్కారు వారి పాట మూవీ యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది. మరొకవైపు ఈ మూవీ సంగీత దర్శకుడు థమన్ కూడా ఇటీవల పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ జనవరిలోనే సర్కారు వారి పాట మ్యూజికల్ అప్ డేట్స్ మొదలవుతాయని చెప్పడం జరిగింది.

అయితే రేపు న్యూ ఇయర్ కావడంతో తమ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని, అలానే సాంగ్స్ ని పక్కాగా ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోరుతూ పలువురు మహేష్ బాబు ఫ్యాన్స్ నేడు నిర్మాతలైన మైత్రి వారిని ట్యాగ్ చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి తమ హీరో మూవీ సాంగ్స్ కోసం ఇంతగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ బాధని మైత్రి మూవీ మేకర్ నిర్మాతలు ఎంతవరకు అర్ధం చేసుకుంటారో, తమ సినిమా నుండి ఎప్పుడు అప్ డేట్స్ ఇస్తారో చూడాలి. కాగా ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా భారీ మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: