టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని ప్రస్తుతం మంచి జోష్ తో ఒక్కొక్కటిగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట 2022 ఏప్రిల్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహేష్ తో కలిసి తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకుడు. దాని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమా చేయనున్నారు మహేష్ బాబు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇక దీని అనంతరం మహేష్ బాబు డ్రీమ్ ప్రాజక్ట్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మొదలు కానుంది. మహేష్ హీరోగా నటించనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ సమకూరుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో తీసిన ఆర్ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ పనుల్లో రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. మరొకవైపు మహేష్, రాజమౌళిసినిమా ఇలా ఉండబోతోందని అంటూ పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి ఈ భారీ సినిమాకి సౌత్ ఆఫ్రికా అడవుల నేపధ్యాన్ని తీసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల కథకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఇక మరికొందరు అయితే మహేష్ తో రాజమౌళి తీయబోయేది ఇండియానా జోన్స్ తరహా మూవీ అని అంటుంటే ఇంకొందరు వారిద్దరూ జేమ్స్ బాండ్ మూవీ చేయనున్నారని ప్రచారాలు మొదలెట్టారు. అయితే లేటెస్ట్ గా పలువురు రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విధంగా పక్కాగా సౌత్ ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్, రాజమౌళి ల సినిమాగా తెరకెక్కుతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత నాలుగు నెలలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న అనంతరమే ఈ సినిమా గురించి రాజమౌళి ఆలోచన చేసి, స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే ఆయనే స్వయంగా ప్రకటిస్తారని, అప్పటివరకు ఈ సినిమాకి సంబందించి వచ్చిన వార్తలేవి వాస్తవాలు కాదని వారు వెల్లడించినట్లు సమాచారం. దీనితో ఈ సినిమాకి సంబంధించి ప్రచారం అవుతున్న వార్తలు అన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: