మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర చేస్తుండగా ఆయన అనుచరుడైన సిద్ద పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కి జోడీగా కాజల్, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించనున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సోను సూద్ విలన్ గా నటిస్తుండగా దీనిని మంచి యాక్షన్ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికె రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ ఎంతో ఆకట్టుకుని సినిమాపై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.

అయితే విషయం ఏమిటంటే న్యూ ఇయర్ ని పురస్కరించుకుని ఆచార్య నుండి 'శానా కష్టం' అనే పల్లవితో సాగే మాస్ బీట్ సాంగ్ ని జనవరి 3వ తీదీన సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ మాస్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. దానితో ఒక్కసారిగా మెగాభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుండడం విశేషం. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: