టాలీవుడ్ యాక్టర్ మహేష్ బాబు లేటెస్ట్ గా చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థతో కలిసి నిర్మిస్తుండగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ మూవీకి మది ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ రిలీజ్ అయి మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.

మహేష్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో సుబ్బరాజు, వెన్నెల కిషోర్, జగపతి బాబు, సముద్రఖని కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం తన మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట షూట్ కి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం దుబాయ్ లో ఫ్యామిలీ తో కలిసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక కొద్దిసేపట్లో న్యూ ఇయర్ కావడంతో కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన ఫ్యాన్స్ కి ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియచేసారు. కొత్త సంవత్సరానికి ఆనందంతో, నమ్మకంతో, ప్రశాంతతతో ఆహ్వానం పలుకుదాం.

మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎల్లప్పుడూ మీ ప్రేమ నాతోనే ఉంటుంది అంటూ తన ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ లో దిగిన ఫోటోతో మహేష్ బాబు పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. మొదటి నుండి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ప్రతి అకేషన్, అలానే సినిమాల సంగతులు షేర్ చేసుకునే అలవాటు గల మహేష్, ఈ విధంగా అందరికంటే ముందు తమకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడంతో ఆయన ఫ్యాన్స్ అమితానందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి లో ప్రారంభం కానుండగా సినిమాని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: