ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది బేబమ్మ అదే మన కృతి శెట్టి. మొదటి సినిమాతోనే అమ్మడు స్టార్ రేంజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. బేబమ్మ పాత్రలో ఆమె అందం, అభినయం యూత్ ఆడియెన్స్ కు భలే నచ్చేసింది. కృతి శెట్టి ఫ్యామిలీ బెంగుళూరులో ఉంటారు. కృతి శెట్టి ఫాదర్ ఓ బిజినెస్ మెన్. ఆమె మదర్ కూడా ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు. కృతి శెట్టి ముందు మోడల్ గా ఆమె కెరియర్ ప్రారంభించారు. మదర్ ఫ్యాషన్ డిజైనర్ అవడంతో ఆమె కొంతమంది మోడల్స్ కు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేశారు.

ఈ క్రమంలో కృతి శెట్టిని కూడా మోడలింగ్ వైపు తీసుకెళ్లారు. అయితే కృతి శెట్టి ముంబైలో సైకాలజీ స్టడీ పూర్తి చేసింది. ఓపెన్ యూనివర్సిటీలో సైకాలజీ చదివింది కృతి శెట్టి. కృతి శెట్టి ఉప్పెన కన్నా ముందు ఒక సినిమాలో నటించింది. అయితే అందులో ఆమె జస్ట్ స్టూడెంట్ గా నటించింది. బాలీవుడ్ లో వికాస్ బహి డైరక్షన్ లో తెరకెక్కిన సూపర్ 30 సినిమాలో కృతి శెట్టి స్టూడెంట్ గా చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా 2019లో వచ్చింది. ఆ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది అమ్మడు.

ఉప్పెన సినిమాకు ముందు ప్రియాంక అనే హీరోయిన్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె పర్ఫార్మెన్స్ అంత ఇంప్రెసివ్ గా అనీపించక మధ్యలో కృతి శెట్టిని తీసుకున్నారు. అలా ఉప్పెనతో వచ్చిన ఫస్ట్ ఆఫర్ తోనే కృతి శెట్టి సూపర్ పాపులర్ అయ్యింది. కృతి శెట్టి ఈమధ్యనే నాని హీరోగా వచ్చిన ష్యాం సింగ రాయ్ సినిమాలో నటించింది. సెకండ్ సినిమాలోనే లిప్ లాక్ సీన్ చేసి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది అమ్మడు. క్యారక్టర్ డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి సీన్ అయినా ఓకే అనేస్తుంది కృతి శెట్టి. ప్రస్తుతం ఆమె చేతిలో సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలి. నితిన్ మాచర్ల నియోజక వర్గం, బంగారాజు, రామ్ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: