ప్రభాస్ కథానాయకుడిగా రాధే శ్యామ్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమా. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఇక డైరెక్టర్ గా రాధాకృష్ణ ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అని చెప్పవచ్చు. ఈ సినిమాని ఒక విభిన్నమైన ప్రేమ కథ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో భారీ ఫైట్లు గాని, కామెడీ సన్నివేశాలు గానీ ఉండవని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత.. సలార్ మూవీ గురించి ఇప్పుడు ఒక అప్డేట్ వెలువడినట్లు సమాచారం వాటి గురించి చూద్దాం.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా  షూటింగ్ ను ప్రారంభించి కొన్ని షెడ్యూల్స్  కూడా పూర్తి చేసుకున్నది. ఈ కారణాల వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఉంది. ఇక ఈ సినిమా కే జి ఎఫ్ సినిమా ని మించిపోయేలా భారీ యాక్షన్ తో తెరకెక్కించబోతున్న ట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు ప్రభాస్. తిరిగి మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు షూటింగులో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ను జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న ట్లుగా సమాచారం. ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను ప్రమోట్ చేసే పనిలో చాలా బిజీగా మారిపోయారు. ఇక అందుకోసం కొన్ని ఈవెంట్స్ కూడా వెంట వెంటనే పాల్గొనడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదల అవ్వగానే సలార్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: