సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వం లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా నుండి  కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా  ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా జలాలలో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయకుండా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాకపోతే మహేష్ బాబుకు చిన్న సర్జరీ కావడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. అయితే మొదట సర్జరీ కారణంగా కొంత కాలం రెస్ట్ తీసుకొని ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెడదామని మహేష్ బాబు అనుకున్నాడట,  కాకపోతే సర్జరీ నుండి మహేష్ బాబు త్వరగా కోలుకోవడంతో జనవరి లోనే సర్కార్ వారి పాట షూటింగ్ ను మొదలు పెట్టానున్నట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు అనుకున్నదాని కంటే త్వరగా సర్జరీ నుండి కోలుకొని ఒక నెల ముందుగానే  సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ త్వరగా మొదలు పెట్టడం వల్ల మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కూడా త్వరగానే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: