విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కి 2019 లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించిన సినిమా ఎఫ్ టు,  కామెడీ ప్రధాన నేపథ్యం గా తెరకెక్కిన ఈ సినిమా భార్యా భర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న గొడవలను తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  అలా ఎఫ్ టు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా,  మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, అలాగే ఈ సినిమాకు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  

అయితే ఎఫ్ టు, సినిమాలో భార్యా భర్తల మధ్య గొడవలను తీసుకొని కామెడీ సృష్టించిన అనిల్ రావిపూడి, ఎఫ్ త్రీ సినిమాలో డబ్బు సమస్యను తీసుకొని కామెడీని సృష్టించబోతున్నట్లు దర్శకుడు ఇప్పటికే తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఎఫ్ టు సినిమాను విడుదల చేసిన సంక్రాంతికే ఎఫ్ త్రీ  ని కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది, దానికి తగినట్టుగానే షూటింగ్ ను కూడా చిత్ర బృందం పూర్తి చేసుకుంటూ వచ్చింది.  అయితే తాజాగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఈ సినిమాను 29 ఏప్రిల్ 2022 లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం తెలియజేసింది, దీనితో ఎఫ్  టు సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించగా, ఎఫ్ త్రీ సమ్మర్ సీజన్ కు ప్రేక్షకులను అలరించబోతోంది. ఇది ఇలా ఉంటే ఎఫ్ టు సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఎఫ్ త్రీ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: