లాస్ట్ ఇయర్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబుతో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుధీర్ బాబు.. కృతి శెట్టి ఇద్దరు ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్ వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఉప్పెన సినిమాతో తన సత్తా చాటిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో అరడజను సినిమాల దాకా చేస్తుంది. అంతేకాదు నాని హీరోగా వచ్చిన శ్యాం సింగ రాయ్ సినిమాతో కూడా కెరియర్ లో మరో హిట్ అందుకుంది కృతి శెట్టి. శ్యాం సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రలో కృతి మెప్పించింది. సినిమాలో లిప్ లాక్ చేసి సర్ ప్రైజ్ చేసింది అమ్మడు.

సుధీర్ బాబు, కృతి శెట్టి ఇద్దరి జోడీ సూపర్ అని చెప్పొచ్చు. పోస్టర్ తోనే సినిమాపై క్రేజ్ తెచ్చాడు డైరక్టర్ ఇంద్రగంటి. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఆల్రెడీ వీరి కాంబోలో సమ్మోహనం, వి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా తప్పకుండా యూత్ ఆడియెన్స్ ను మెప్పిస్తుందని అంటున్నారు. రెండు హిట్లతో ఫుల్ ఫాం లో ఉన్న కృతి శెట్టి ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి. సుధీర్ బాబు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: