రాజ శ్రీ నాయర్ ప్రముఖ టాలీవుడ్ నటీమణుల్లో ఈమె ఒకరు. యాంకర్‌గా, నటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రాజశ్రీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. వాస్తవానికి సినీ ఇండస్ట్రీ అంటే ఏ కుటుంబం అంత ఈజీగా ఒప్పుకోదు. రాజశ్రీ కుటుంబసభ్యులు కూడా సినీ ఇండస్ట్రీలో రావడానికి నిరాకరించారు. మొదట్లో పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలా సినిమాల్లో అవకాశాలు పెరిగాయని ఆమె తెలిపారు.

రాజశ్రీ నటించిన ‘హైదరాబాద్ బ్లూస్’ అనే మూవీతో ఆఫర్లు పెరిగాయి. తెలుగు కంటే హిందీలోనే తనకు ఎక్కువ ఆఫర్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. అప్పుడు కొన్ని ఆఫర్లను కూడా వదులుకున్నట్లు ఆమె తెలిపారు. కేవలం హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేశారు. ఒక సినిమాలో అయితే దెయ్యం పాత్రను కూడా పోషించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఒక స్టార్ హీరో, హీరోయిన్ గురించి వెల్లడించారు. కన్నడ భామ అయినప్పటికీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న సౌందర్య, స్టార్ హీరో విక్రమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

హీరోయిన్ సౌందర్యతో కలిసి ఆమె ‘9 నెలలు’ అనే సినిమాలో రాజశ్రీ నటించారు. ఆ తర్వాత తాను సీరియళ్లకు పరిమితమయ్యానని రాజశ్రీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నటి సౌందర్య గురించి మాట్లాడుతూ.. సౌందర్య చాలా స్ట్రిక్ట్. తన సోదరుడితో కలిసి షూటింగ్ స్పాట్‌కి వచ్చేదన్నారు. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా మాట్లాడేదన్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తుండేదన్నారు. సాంప్రదాయం, పద్ధతికి కేరాఫ్‌గా ఉండేదన్నారు. అలాంటి మంచి నటి ఇక రారేమో అంటూ బాధను వ్యక్తం చేశారు. ఆ సినిమాలో విక్రమ్ కూడా నటించారని.. తను చాలా నాటీ అని ఆమె పేర్కొన్నారు. సౌందర్య ఎప్పుడు కనిపించిన మేడం మేడం అంటూ అల్లరి చేసేవాడన్నారు. కాగా.. ప్రస్తుతం రాజశ్రీ బంగార్రాజు సినిమా కృతిశెట్టికి తల్లిపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: