సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో ఎక్కువగా నటించి నటి సుధ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అలాగే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.ఒక ఆర్టిస్ట్ మంచి పాత్రలు చేసిన తర్వాత చిన్నచిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపరని సుధపేర్కొన్నారటా..
కొన్ని సినిమాలలో తాను నటించనని డైరెక్ట్ గా చెప్పానని సుధ వెల్లడించారని తెలుస్తుంది..క్యారెక్టర్ గుర్తుండిపోయే పాత్రలు మాత్రమే చేయాలని సుధ అనుకున్నదట.


అన్నపూర్ణమ్మకు నాకు ఎలాంటి గొడవలు లేవని ఆమెను తాను అత్త అని పిలుస్తానని సుధ పేర్కొన్నారు..మా ఇంట్లో ఏది మంచి చెడు జరిగినా చంద్రమోహన్ ఫ్యామిలీ ఉంటుందని సుధ చెప్పుకొచ్చినట్లు సమాచారం.తనకు మంచి పాత్రలు పడ్డాయని అందువల్లే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సుధ అన్నారటా..మోహన్ బాబుకు అక్క పాత్రలో అలాగే బాలయ్యకు నాగార్జునకు తల్లి పాత్రలలో తాను నటించానని సుధ చెప్పుకొచ్చారటా..

మలయాళంలో కూడా చాలామంది స్టార్ హీరోలకు తాను తల్లిగా నటించానని సుధ చెప్పుకొచ్చారు..తాను మదర్ క్యారెక్టర్ చేసే సమయంలో చాలామంది తనపై కోప్పడ్డారని సుధ చెప్పుకొచ్చారు.జీవితాంతం ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండాలని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఇండస్ట్రీలో ఉండవచ్చని సుధ తెలిపారు.పేరెంట్స్ నాకు గుండె చప్పుడు అని సుధ వెల్లడించారు.

ప్రెసిడెంట్ గారి పెళ్లాం మూవీ షూటింగ్ సమయంలో మూడోరోజు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది అని ఆ సినిమా షెడ్యూల్ ను నాకోసం ఆపేసి తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాకోసం వచ్చారని సుధ చెప్పుకొచ్చారటా..చిరంజీవి సైతం మానవత్వం తో చూడటానికి వచ్చారని సుధ పేర్కొన్నారు.దొరస్వామిరాజుగారితో అయితే నేను బ్రతికుంటే తిరిగి వచ్చి వర్క్ చేస్తానని ఆయనతో అన్నట్లు సుధ చెప్పారు.ఆ సమయంలో దొరస్వామిరాజు అలాంటి మాటలు మాట్లాడొద్దు నన్ను తిట్టారంటూ సుధ చెప్పుకొచ్చినట్లు సమాచారం.ఆ సమయంలో మళ్ళీ నేను బ్రతుకుతాను అని అస్సలు అనుకోలేదని దేవుడి దయతో ఆపరేషన్ సక్సెస్ అయ్యి నేను మళ్ళీ సినిమాలలో నటించగలుగుతున్న అంటూ చెప్పుకొచ్చిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: