ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు యాంకర్లలో వర్షిణి ఒకరు. వర్షిణి అసలు పేరు షామిలీ సౌందరరాజన్. సినీ ఇండస్ట్రీకి 2010లో ‘శంభో శివ శంభో’ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ‘చందమామ కథలు’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. వర్షిణి జన్మస్థలం హైదరాబాద్. ఎలక్ట్రానిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మొదట్లో వర్షిణి మోడల్‌గా తన కెరియర్ స్టార్ట్ చేసింది. కాయ్ రాజా కామ్, శ్రీ రామ రక్ష వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సోషల్ మీడియా ద్వారా బుల్లితెర రియాలిటీ షో ‘ఢీ’లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందంలో టాప్ గ్లామరస్ యాంకర్‌గా వర్షిణి ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది. ఫోక్ స్టెప్పులతో తనదైన శైలిలో యువతను ఊర్రూతలూగించింది. కామెడీ షోలు, పలు ఈవెంట్స్ నిర్వహిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ట్రెడిషనల్, గ్లామరస్ లుక్‌ వర్షిణికే సొంతం. ఆ మధ్య స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్’ అనే షోలో యాంకర్‌గా చేసింది. ఆ షో జబర్దస్త్‌ కు పోటీగా వచ్చినా.. ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినా ఈ షోకి యాంకర్‌గా ఉన్న వర్షిణికి మాత్రం క్రేజ్ విపరీతంగా పెరిగింది.

షోలతోపాటు.. వెబ్ సిరీస్‌లోనూ వర్షిణి నటిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించిన పెళ్లి గోలలో అభిజీత్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. మరో రెండు సీజన్లలోనూ నటించింది. 2017లో హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ ఎడిషన్‌లో వర్షిణి పేరు కూడా ఉంది. అంతటి పాపులారిటీ సంపాదించిన వర్షిణికి.. ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో వరుస అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. అందుకే తన పాపులారిటీ పెంచుకోవడానికి తన హాట్ పిక్స్‌ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. క్రేజ్ పెంచుకుంటోంది. హీరోయిన్లకు ధీటుగా పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: