ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ ను సంపాదించి తనకు తిరుగు లేదు అన్న విధంగా దూసుకుపోతున్నాడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో లో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినా సుధీర్ ఆ తర్వాత రష్మితో లవ్ ట్రాక్  నడుపుతూ తెలుగు ప్రేక్షకులని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో టీం లీడర్ గా అవతారమెత్తి తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ సుడిగాలి సుదీర్ గా మారిపోయాడు. ఇక టీం లీడర్ గా మారిన తర్వాత సుధీర్ కు తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా సుడిగాలి సుదీర్ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ జంట ఎక్కడ కనిపించిన కూడా అటు ప్రేక్షకులు అందరూ ఎంతగానో మురిసిపోయేవారు. అయితే ఒకప్పుడు కేవలం జబర్దస్త్ లో మాత్రమే అలరించిన జంట ఈ తర్వాత ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ లో కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరికీ ఉన్న క్రేజ్ కారణంగానే ఢీ షో కి మంచి పాపులారిటీ వచ్చింది అని చెప్పాలి.. ఇక ఇలాంటి సమయంలో ఢీ 14వ సీజన్ సుధీర్ రష్మీ లేకుండానే మొదలుపెట్టారు. దీంతో ఢీ షో నుంచి సుధీర్ రష్మీ ని ఎందుకు తొలగించారు అన్న చర్చ మొదలయింది. అదే సమయంలో  షో రేటింగ్ కూడా అంతకంతకూ తగ్గిపోతూ వచ్చింది.



 సుడిగాలి సుదీర్ గాలోడు షూటింగ్ వల్ల ఢీ షో కి అందుబాటులో లేకుండా పోయాడని.. రష్మి కూడా షూటింగ్ వల్లే  దూరం అయింది అన్న టాక్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఇటీవలే జబర్దస్త్ కార్య క్రమంలో తన మీద తానే పంచు వేసుకున్నాడు సుడిగాలి సుదీర్. హైపర్ ఆది స్కిట్ లో భాగంగా ఆచార్య స్పూఫ్ చేశారు హైపర్ ఆది సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే ఈ శాంతి స్వరూప్ వచ్చి నువ్వు మానేయాలి అంటూ చెబుతుంది. ఇప్పటికే ఢీ మానేశాను ఇంకేం మానేయాలి అంటూ సుడిగాలి సుదీర్ పంచ్ చేస్తాడు. ఇంతలో జడ్జ్ రోజా నాలుక కరుచుకుంది. సుధీర్ ఇలా అనడం తో సుధీర్ షెడ్యూల్ కుదరక మానేసాడా.. లేకపోతే నిర్వాహకులు తీసివేశారా అన్న చర్చ మళ్ళీ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: