గత ఏడాది తొలినాళ్ళలో మంచి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఆ సినిమా సూపర్ హిట్ టాలీవుడ్ కి కొత్త ఊపిరిని ఇచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకులను బాగా అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ అనే చెప్పాలి. ఆయన జాంబీ రెడ్డి సినిమా తో మంచి వెరైటీ కాన్సెప్ట్ ఉన్న సినిమా చేసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మరచిపోలేని హిట్ కొట్టి భారీ వసూళ్లు అందుకున్నారు. ఆయన ఈ సినిమా తో మంచి హిట్ కొట్టడమే కాకుండా బెస్ట్ డెబ్యూ సాధించాడని చెప్పాలి.
ఇక వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు దర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అగ్ర దర్శకుల లిస్టులో చేరిపోయాడు. ఇక వెంకటేష్ నారప్ప సినిమా తో శ్రీకాంత్ అడ్డాల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు అఖండ సినిమా రూపంలో సూపర్ హిట్ దక్కింది అని చెప్పాలి. మధ్య లో లవ్ స్టోరీ చిత్రం పర్వాలేదనిపించుకోగా అఖండ సినిమా తో బోయపాటి శ్రీను ఆ సంవత్సరం భారీ హిట్ అందుకున్న దర్శకుడు గా నిలిచాడు. ఇక సుకుమార్ పుష్ప మొదటి భాగం సినిమా తో అదరగొట్టాడు.