కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు 2021 వ సంవత్సరం గత ఏడాది అయిపోయింది. మరి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు ఏవి బాగా నచ్చాయి. ఏ సినిమాల దర్శకులు ప్రేక్షకులను బాగా అలరించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి నుంచి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తూనే వచ్చారు. ఆ విధంగానే టాలీవుడ్ లో గత ఏడాది చాలా మంది దర్శకులు మంచి మంచి సినిమాలను చేసుకుంటూ వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

గత ఏడాది తొలినాళ్ళలో మంచి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఆ సినిమా సూపర్ హిట్ టాలీవుడ్ కి కొత్త ఊపిరిని ఇచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకులను బాగా అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ అనే చెప్పాలి. ఆయన జాంబీ రెడ్డి సినిమా తో మంచి వెరైటీ కాన్సెప్ట్ ఉన్న సినిమా చేసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మరచిపోలేని హిట్ కొట్టి భారీ వసూళ్లు అందుకున్నారు. ఆయన ఈ సినిమా తో మంచి హిట్ కొట్టడమే కాకుండా బెస్ట్ డెబ్యూ సాధించాడని చెప్పాలి.

ఇక వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు దర్శకుడు వేణు శ్రీరామ్.  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అగ్ర దర్శకుల లిస్టులో చేరిపోయాడు. ఇక వెంకటేష్ నారప్ప సినిమా తో శ్రీకాంత్ అడ్డాల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు అఖండ సినిమా రూపంలో సూపర్ హిట్ దక్కింది అని చెప్పాలి. మధ్య లో లవ్ స్టోరీ చిత్రం పర్వాలేదనిపించుకోగా అఖండ సినిమా తో బోయపాటి శ్రీను ఆ సంవత్సరం భారీ హిట్ అందుకున్న దర్శకుడు గా నిలిచాడు. ఇక సుకుమార్ పుష్ప మొదటి భాగం సినిమా తో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: