టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి కూడా ఒకరు. ఇప్పటివరకు మంచి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడికి సరైన క్రేజ్ రాలేదు. దర్శకుడిగా ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ విజయాలు అందుకున్నప్పుడే దానికి తగ్గ విలువ ఉంటుంది. లేకపోతే అంతే సంగతులు. ఇక  మొదటి నుంచి కూడా మోహన్ కృష్ణ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఆయన ఒక హిట్ కొడితే ఆ తర్వాత వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఆయన్ను పలకరిస్తున్నాయి. దీంతో స్టార్ డైరెక్టర్ హోదాకి ఆమడదూరంలో ఉండి పోతున్నాడు ఈ దర్శకుడు. 'అష్టా చమ్మా' అనే సినిమాతో ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి మంచి బ్రేక్ వచ్చింది.

ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా దర్శకుడిగా ఇంద్రగంటి కెరీర్ కి పునాది వేసింది. ఇక తర్వాత 'అంతకు ముందు ఆ తరువాత', 'జెంటిల్మెన్', 'సమ్మోహనం' సినిమాలు వరుసగా విజయాలు సాధించగా అక్కడితో ఇంద్రగంటి స్టార్ డైరెక్టర్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నో ఆశలతో ఆయన తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ 'వి' దారుణంగా ఫ్లాప్ అయింది. నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో ఇంద్రగంటి మోహన కృష్ణ కెరీర్ మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఎలాగైనా ఓ అగ్ర హీరోతో సినిమా చేసి స్టార్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను మోహన్ కృష్ణ. దాని కోసం ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపడం లేదట. ముఖ్యంగా మహేష్ బాబు ని ఒప్పించి ఓ సినిమా చేయాలని ఆయన టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నాడట. దీంతో మహేష్ కోసం ఆయన బావ హీరో సుధీర్ బాబు ని కాకా పడుతున్నాడట ఈ దర్శకుడు. సుధీర్ బాబు చొరవతో మహేష్ బాబుకు కథ వినిపించే అవకాశం దక్కించుకోవాలని అనుకుంటున్నాడట. అయితే స్క్రిప్ట్ నచ్చితే స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాడు మహేష్ బాబు. కాబట్టి ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మహేష్ బాబు సినిమా చేస్తాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: